టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి..

778
trs sunitha laxmareddy
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. కొంతకాలం క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణలో భవన్‌లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.సునీతతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ,ఎంపీటీసీ,సర్పంచ్‌లు పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరారు.

నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన సునీతాలక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవుల్లో పని చేశారు. భర్త లక్ష్మారెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె సీపీఐ కంచుకోటను బద్దలు కొట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఉద్దండ నేత విఠల్‌రెడ్డిని ఓడించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వివాదరహితురాలిగా, సౌమ్యురాలిగా పేరున్న ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది.

- Advertisement -