కేసీఆర్‌ను కలవనున్న పవన్‌..!

229
- Advertisement -

భిన్న ధృవాలు ఒకే వేదికపైకి రానున్నాయి. ఒకరు రాష్ట్రం తెచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు. మరొకరు రాష్ట్ర హక్కును సాధించుకోవడం కోసం ఉద్యమిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వస్తున్నారు. వీరిద్దరి కలయికపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో కాదు ఒకరు ముఖ్యమంత్రి కేసీఆర్..మరోకరు జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

అయితే వీరు క‌లుసుకునేది రాజకీయ వేదికపై కాదు. అది రాజకీయ భేటీ అంతకన్నా కాదు. ఓ ఆడియో వేడుకకు ఈ ఇద్దరు నేతలు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం జాగ్వార్. దాదాపు 75 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతోంది.

jaguar

ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం కుమారస్వామి..తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.జాగ్వార్ ఆడియో  విడుదలకు రావాల్సిందిగా కోరారు. దీనికి కేసీఆర్ వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  తర్వాత జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. పవన్ ను ఆడియో  విడుదల కార్యక్రమానికి రావాల్సిందిగా కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు.  అన్నీ అనుకున్నట్టు జరిగితే కేసీఆర్, పవన్, ఒకే వేదికమీద కలుసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇద్దరు దిగ్గజాలు అటెండ్ అయితే ఇక తన తనయుడి మూవీ హిట్ కావడానికి అదే కారణమవుతుందని కుమారస్వామి భావిస్తున్నారట. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం విశేషం.

- Advertisement -