మొక్కలు నాటిన ఉత్తమనటి…. ప్రియమణి

458
priyamani
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మధురైలోని కోయిల్ పట్టి లో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ప్రియమణి,దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(సీతమ్మ వాకిట్లో.. ), కెమెరామాన్ శ్యాం కే నాయుడు,క్యారెక్టర్ నటులు రామరాజు.

ఈ సందర్భంగా ఉత్తమనటి ప్రియమణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. షూటింగ్ కోసం తాను మధురై సమీపంలోని ‘కోయిల్ పట్టి’ కి వచ్చాను. ఇక్కడ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ వారు నన్ను మొక్కలు నాటాలని కోరడం చాలా ఆనందంగా ,సంతోషంగా ఉందన్నారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి .బర్త్ డే,మ్యారేజ్ డేల సందర్భంగా రకరకాల బహుమతులు కాకుండా ఇలా మొక్కలు నాటించాలని,వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -