ఉద‌యాన్నే వాట‌ర్ తో ఉపయోగాలు?

485
water
- Advertisement -

ఉద‌యం లేవ‌గానే మంచి నీళ్లు తాగ‌డం వ‌ల‌న ఆరోగ్యానికి మంచిద‌ని మ‌నంకంద‌రికి తెలిసిందే. వ్యాయ‌మం చేయ‌డం, జిమ్ చేయ‌డం ఎంత ముఖ్య‌మో వాట‌ర్ తాగ‌డం కూడా మ‌న శ‌రీరానికి అంతే ముఖ్యం. ముఖ్యంగా ఎండ‌కాలం ఇంకా కొంచెం ఎక్కువ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల ఎండ వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ఒక లీట‌ర్ నీటిని తాగితే ఏలాంటి రోగాలు రావ‌ని మ‌న పెద్ద‌లు, అలాగే వైద్యులు కూడా చెబుతుంటారు. లేవ‌గానే ప‌డిగ‌డుపున ఒక లీట‌ర్ నీటిని త్రాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మంచిద‌ని ఎటువంటి స‌మ‌స్య‌లు రావ‌ని వైద్యులు చెబుతుంటారు.

పెద్ద‌వారు చాలా మంది ఉద‌యం లేచి కాల‌కృత్యాలు తీర్చుకోగానే మొద‌ట‌గా చేసే ప‌ని ఒక లీట‌ర్ తాగుతారు. నీటిని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల అనే లాభాలున్నాయి. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న శ‌రీరంలో కొన్ని జ‌రిగిపోతుంటాయి. ఉద‌యాన్నే నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిక్ రేటు 24 శాతం పెరుగుతుంది.. కోవ్వు ఉన్న‌వారికి కూడా మంచి నీళ్లు చాలా ఉప‌యోగ‌ప‌డుతాయి. లావుగా ఉన్న‌వారు స‌న్న‌గా అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. శ‌రీరంలో ఉన్న క్రిములు, వ్య‌ర్ధాలు అన్ని బ‌య‌ట‌కు వెళ్లిపోయి…శ‌రీరం అంతా శుభ్రంగా త‌యార‌వుతుంది.అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వచ్చు. త‌ల‌నొప్పి భారీ నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు అంతేకాకుండా ఎలాంటి ఇన్ ఫెక్ష‌న్లు, అల్స‌ర్లు రాకుండా వాట‌ర్ కాపాడుతాయి.

ఎర్ర‌ర‌క్త‌కణాలు పెరిగి ఎక్కువ ఆక్సిజ‌న్ ను తీసుకుంటాయి. దీని వ‌ల్ల శ‌రీరానికి ఎక్కువ‌గా శ‌క్తి అందుతోంది. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వ‌డ‌మే కాకుండా చ‌ర్మ సంబంధ వ్యాధులు నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. క‌డుపులో మంట గా ఉన్న‌వారికి రోజు లేవ‌గానే ఒక లీట‌ర్ వాట‌ర్ ను తాగితే క‌డుపునోప్పి భారీ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా జీర్ణాశ‌యం పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా న‌శించి కొత్త బాక్టిరియాను త‌యారుచేస్తుంది. వాట‌ర్ ను ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఇన్ని ర‌కాల ఉప‌యోగాలు ఉన్నాయి.

Also Read:ఆ వీడియోకి కృతి సనన్ ఫేస్ పెట్టారు

- Advertisement -