తొలి జాబితా ప్రకటించిన జనసేన పార్టీ..

261
Pawan Kalyan
- Advertisement -

లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలలో రాజకీయ సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఓట్ల కోసం  కసరత్తు మొదలుపెట్టాయి. అయితే ఏపీలో జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏపీలోని పలు స్థానాలతో తొలి జాబితాను ఖరారు చేసింది.

జనసేన పార్టీ నుంచి తొలి విడతగా..32 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితా ఖరారు చేసినట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలి జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. తొలి జాబితాలో తూర్పుగోదావరి, గుంటూరు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల స్థానాలుండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -