లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలలో రాజకీయ సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఓట్ల కోసం కసరత్తు మొదలుపెట్టాయి. అయితే ఏపీలో జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏపీలోని పలు స్థానాలతో తొలి జాబితాను ఖరారు చేసింది.
జనసేన పార్టీ నుంచి తొలి విడతగా..32 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితా ఖరారు చేసినట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలి జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. తొలి జాబితాలో తూర్పుగోదావరి, గుంటూరు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల స్థానాలుండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
JanaSena Chief @PawanKalyan announced Amalapuram & Rajahmundry Parliament contestants.
Amalapuram Parliament JanaSena Contestant D.M.R Sekhar
Rajahmundry Parliament JanaSena Contestant Dr. Akula Satyanarayana #JANASENARevolution2019 pic.twitter.com/TuJ2e8LvWM
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2019