- Advertisement -
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. 209 దేశాలకు కరోనా వైరస్ విస్తరించగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96వేలకు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3.55 లక్షల మంది కోలుకున్నారు.
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కు చేరింది. ఇప్పటివరకు 635 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 5,863 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు.ఇవాళ 60 మంది బాధితులు డిశ్చార్జ్ కాబోతున్నారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- Advertisement -